ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 108 నంబర్‌కి బదులుగా 0864 5660208, 83310 33405 నంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు.