Asianet News TeluguAsianet News Telugu

కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు, ఒకరు మృతి.. (వీడియో)

ఈ ప్రమాదంలో కైలా ప్రశాంత్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. 

innova car plunges into KEB canal in krishna district, one dead
Author
Hyderabad, First Published Sep 18, 2021, 9:38 AM IST

కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. కొత్తపాలెం సమీపంలోని కేఈబీ కెనాల్ లోకి  ఇన్నోవా కారు దూసుకెళ్లింది.

 "                            
                                                   
ఈ ప్రమాదంలో కైలా ప్రశాంత్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.               
                                                
కాగా, ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నారని తెలిసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఇన్నోవా కాలువలోకి దూసుకెళ్లిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios