Asianet News TeluguAsianet News Telugu

కాపు నేతలు ఎందుకు రాలేదో తెలియదు: గంటా

కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

I dont know why kapu leaders not attend chandrababu meeting says ganta
Author
Amaravathi, First Published Jun 26, 2019, 2:42 PM IST

అమరావతి: కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

బుధవారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ నేతలు  సమావేశమయ్యారు.  ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.కాకినాడ మీటింగ్ వెళ్లిన వాళ్లలో కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అందరికి  ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపలేదని ఆయన తెలిపారు. 

విజయవాడలో ఉండి కూడ కొందరు కాపు నేతలు  చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయం తనకు తెలియదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయమై గురువారం నాడు ఏపీ డీజీపీని కలుస్తామన్నారు. 

ప్రజావేదికను కూల్చడాన్ని ఆయన తప్పుబట్టారు.  అర్ఝరాత్రి పూట ప్రజావేదికను కూలుస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios