చంద్రబాబు నివాసం వద్ద కర్రలతో వైసీపీ నేత హల్చల్.. టీడీపీ ఫ్లెక్సీలు చించివేత (వీడియో)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం వున్న ఉండవల్లి కరకట్ట వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు కర్రలతో హల్చల్ చేశారు. సందీప్ అనే వైసీపీ నేత తన అనుచరులతో కలిసి కరకట్టకు ఇరువైపులా వున్న టీడీపీ బ్యానర్లను చించివేశాడు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం వున్న ఉండవల్లి కరకట్ట వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు కర్రలతో హల్చల్ చేశారు. సందీప్ అనే వైసీపీ నేత తన అనుచరులతో కలిసి కరకట్టకు ఇరువైపులా వున్న టీడీపీ బ్యానర్లను చించివేశాడు. చంద్రబాబు, లోకేష్ల ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేయడంతో పాటు రాళ్లు తీసుకుని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.