Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. 

High Court Shock To AP Govt Over PMAY NTR Houses Issue akp
Author
Amaravati, First Published Jun 25, 2021, 5:00 PM IST

అమరావతి: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు చెల్లవంటూ... వారిని అనర్హులుగా ప్రకటిస్తూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.

పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనతో ఇళ్లపట్టాలు పొందలేకపోయిన కొంతమంది మంగళగిరి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. 

read more  ఏపీలో పరిషత్ ఎన్నికలు: సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం బాధితుల తరపు వాదనలు విని ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. చిన్నచిన్న కారణాలు చూపి అనర్హులుగా ప్రకటించడమేంటని జగన్ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios