మానసిన వికలాంగురాలిపై వృద్దుడి అత్యాచారం
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒంటరిగా వున్న ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముప్పాళ్ల మండలం ఇరుకపాలెం గ్రామంలో మానసిక వికలాంగురాలిపై చౌడయ్య(55) అనే వృద్దుడు కన్నేశాడు. అయితే సోమవారం ఆమె పొలంలో ఒంటరిగా పనిచేస్తూ ఈ కామాంధుడి కంటపడింది. దీంతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే ఈ విషయం గురించి యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిన చౌడయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.