సీఎం జగన్ దంపతులకు గవర్నర్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దంపతులకు 25వ వివాహ వార్షకోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 25వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆగస్టు 28, 1996 ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల మధ్య వైఎస్ జగన్-భారతిల వివాహం ఘనంగా జరిగింది. అదే ముహూర్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరిపించారు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించారు.
ఈ సందర్భంగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దంపతులకు 25వ వివాహ వార్షకోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.