తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో  ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 


కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: ఆరా తీసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి పుష్పలత భర్త శ్రీనివాస్ రెడ్డిని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎన్నికల్లో పోటీకి దిగొద్దని హెచ్చరించారు. ఇవాళ ఆయన అనుమానాస్పదస్థితిలో మరణించారు. 

ఈ విషయం తెలుసుకొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామంలో పర్యటించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కేసు విచారణను ఏస్పీ విచారిస్తున్నారు. ఈ కేసులో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశించారు. వీరిద్దరిని వీఆర్ కు పంపాలని ఆదేశించారు. ఈ కేసును ఎస్పీ విచారిస్తున్నారు.