Asianet News TeluguAsianet News Telugu

గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: సీఐ, ఎస్‌ఐలు వీఆర్‌కి తరలింపు

తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో  ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 

Gollagunta tdp candidate husband's death:  AP SEC orders two police officers to VR lns
Author
Kakinada, First Published Feb 2, 2021, 4:42 PM IST


కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో  ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 

also read:గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: ఆరా తీసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి పుష్పలత భర్త శ్రీనివాస్ రెడ్డిని రెండు రోజుల క్రితం  గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎన్నికల్లో పోటీకి దిగొద్దని హెచ్చరించారు. ఇవాళ ఆయన అనుమానాస్పదస్థితిలో మరణించారు. 

ఈ విషయం తెలుసుకొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామంలో పర్యటించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కేసు విచారణను ఏస్పీ విచారిస్తున్నారు. ఈ కేసులో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశించారు. వీరిద్దరిని వీఆర్ కు పంపాలని ఆదేశించారు. ఈ కేసును ఎస్పీ విచారిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios