సారాంశం


చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం జి పాల్యం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.  గల్లంతైన వారిలో ఒకరినిస్థానికులు కాపాడారు.  మిగిలిన వారి కోసం సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. 

తిరుపతి: Chittoor  జిల్లాలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకొంది., Swarnamukhi  నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురినిరక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలోని రేణిగుంట మండలం జి పాల్యం వద్ద స్వర్ణ ముఖి నదిలో Fish  పట్టేందుకు నలుగురు పిల్లలు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నలుగురు నదిలో కొట్టుకుపోయారు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు ఒకిరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.