అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  ఆక్సిజన్ అందక మంగళవారం రాత్రి నలుగురు రోగులు మరణించారు. ఈ ఘటనపై విచారణకు  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మంగళవారం రాత్రి నలుగురు రోగులు మరణించారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం నాడు రాత్రి ఏడుగంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు చోటు చేసుకొన్నాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ విషయమై వైద్యులకు చెప్పినా కూడ పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. దీంతో ఆక్సిజన్ అందక రోగులు మరణించారని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆసుపత్రిని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండ్ భాస్కర్ తో పాటు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాహకుడికి నోటీసులు ఇచ్చారు కలెక్టర్.ఆక్సిజన్ సరఫరాలో అంతరాయానికి గల కారణాలపై ప్రభుత్వం ఆరాతీస్తోంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.