Asianet News TeluguAsianet News Telugu

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

తొలుత ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా.. సదరు వ్యక్తి భార్య, ఇద్దరు  కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ కుటుంబంలోని ఇద్దరు శుద్ధ జల నీటి సరఫరా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 

Five Members Of One family gets Coronavirus positive in nandyala
Author
Hyderabad, First Published May 8, 2020, 7:42 AM IST

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోసా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నంద్యాలకు చెందిన ఓ కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. తొలుత ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా.. సదరు వ్యక్తి భార్య, ఇద్దరు  కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ కుటుంబంలోని ఇద్దరు శుద్ధ జల నీటి సరఫరా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 

వీరిలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో నీటి కోసం వచ్చే వారిలో ఆందోళన నెలకొంది. ఈ కుటుంబం కాంటాక్టు లిస్టును తయారు చేసి వారందరినీ క్వారంటైన్‌కు పంపే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. 

కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ పరిదిలో సామాజిక వ్యాప్తి పెరిగిపోతుండటం, కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా వెల్లడైన 5 కొత్త పాజిటీవ్‌ కేసులతో మున్సిపాలిటీలో మొత్తం కేసుల సంఖ్య 110కి పెరిగింది. రూరల్‌లోని 9 కేసులతో మొత్తం 119కి పాజిటీవ్‌ కేసులు చేరాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios