కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకొని దాదాపు రూ.50లక్షల ఆస్తి నష్టం నెలకొంది. ఈ సంఘటన కడపలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... దసరా వేడుకల్లో భాగంగా మంగళవారం కడపలో దుర్గా మాతను ఊరేగించారు. ఈ ఊరేగింపులో భాగంగా భక్తులు బాణసంచా కాల్చారు.
ఆ సమయంలో నిప్పు రవ్వలు ఎగసిపడి.. ఓ గోదాంలోని అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించకపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. గోదాం పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో దాదాపు రూ.50లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 9, 2019, 10:42 AM IST