విజయవాడలో ఫ్యామిలీ ఆత్మహత్య.. అర్ధరాత్రి అన్నకు మెసేజ్ పెట్టిన శ్రీలత.. ఆ కారణంతోనే..!
విజయవాడలో నిజమాబాద్కు (Nizamabad) చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్కు చెందిన పప్పుల సురేష్, అతని భార్య పప్పుల శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ కలిసి ఈ నెల 6వ తేదీన దుర్గమ్మ దర్శనానికి vijayawadaకు వెళ్లారు. తాము చనిపోతున్నామని శ్రీలత, సురేష్లు రాత్రి కుటుంబ సభ్యులకు మెసేజ్లు పెట్టారు.
విజయవాడలో నిజమాబాద్కు (Nizamabad) చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి శ్రీలత, కొడుకు అశిష్.. 20 ఇన్సులిన్ ఇంజెక్ట్ బాటిల్స్ ఇంజెక్టు చేసుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. మెడిసిన్పై అవగాహనతోనే వీరు ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. వారు ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులు 20 ఇన్సులిన్ బాటిల్స్ను, సిరంజీలను గుర్తించారు. ఇక, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్రీలత.. తన అన్నకు అర్దరాత్రి వాయిస్ మెసేజ్ పంపింది. మరోవైపు ఆమె భర్త సురేష్.. తాము ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
వివరాలు.. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన పప్పుల సురేష్, అతని భార్య పప్పుల శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ కలిసి ఈ నెల 6వ తేదీన దుర్గమ్మ దర్శనానికి vijayawadaకు వెళ్లారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్ తీసుకున్నారు. అయితే సురేష్ కొడుకు అఖిల్ పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాడు. అయితే ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడం ఆలస్యం కావడంతో వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
సురేష్ కుటుంబం విజయవాడకు వెళ్లిన తర్వాత రోజు.. ప్రైవేట్ పైనాన్సర్ వారు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇళ్లు తమకు చెందినదని గోడలపై రాసి వెళ్లారు. అంతేకాకుండా ఈ విషయం గురించి వారు చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియజేశారు. సీజ్ చేస్తామనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే విజయవాడలో ఉన్న సురేష్ కుటుంబం ఆత్మహత్యకు యత్నించినట్టుగా సమాచారం. ఈ విషయంపై అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు, బంధువులకు శ్రీలత, సురేష్లు సమాచారం అందజేశారు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు బంధువుకు వారు మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈఅనంతరం శ్రీలత, ఆశిష్లు వారు ఉంటున్న కన్యకా పరమేశ్వరి సత్రంలోనే ఇన్సులిన్ మితిమీరిన డోస్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సురేష్, అఖిల్లు కృష్ణా నదిలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘ఈరోజు ఉదయం నిజమాబాద్ నుంచి మృతులకు సంబంధించి వారు ఫోన్ చేసి.. సత్రంలో దిగిన మా వాళ్లు ఆత్మహత్య చేసుకోబోతున్నారని చెప్పారు. దీంతో వెంటనే సత్రం మేనేజర్ శ్రీధర్.. ఈ విషయాన్ని సత్రం చైర్మన్కు తెలియజేశారు. వెంటనే వారు ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లి చూడగా.. శ్రీలత, అశిష్లు మంచంపై చనిపోయి కనిపించారు. సురేష్, అఖిల్ మృతదేహాలను కృష్ణా నది నుంచి వెలికితీశాం’ అని పోలీసులు తెలిపారు.