Asianet News TeluguAsianet News Telugu

తెనాలిలో విషాదం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కన్నుమూత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డార్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. 

ex tenali mla raavi ravindranath chowdary passed away
Author
Tenali, First Published Jul 21, 2020, 3:23 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డార్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

రావి మరణవార్త విన్న బంధువులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రవీంద్రనాథ్ చౌదరి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios