Asianet News TeluguAsianet News Telugu

మరోసారి వివాదంలోకి చింతమనేని

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి

ex mla chintamaneni clashes with ycp leaders
Author
Hyderabad, First Published May 29, 2019, 9:30 AM IST

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేడుకులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు యత్నించడంతో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాత్రి జరిగిన ఈ ఘటనతో ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో దుగ్గిరాలలో పోలీస్‌ పికెట్ ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని పెదవేగి తహసీల్దార్‌ ఆఫీసుకు పోలీసులు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios