ఏపీ మాజీ మంత్రి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం చెందారు. స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో రాత్రి సుబ్బయ్య మరణించారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తున్న తరుణంలో సుబ్బయ్య అదే సమయంలో బీజేపీని వీడి టీడీపీలో చేరడం గమనార్హం. అనంతరం తిరిగి ఆయన గతేడాది జులై నెలలో బీజేపీలో చేరిపోయారు.