ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి pain లేకుండా చనిపోవడం ఎలా అంటూ తోటి విద్యార్థులతో చర్చించాడు. సోమవారం ఉదయం నలతగా ఉండడంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్ లోనే ఉండి పోయాడు. అదే రూమ్ లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారి తరగతులకు హాజరయ్యారు.
తాడేపల్లిగూడెం : Mechanical Engineering విద్యార్థి suicide పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని Thadepalligudem మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో గతనెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెనికి చెందిన రవితేజ టెక్కలిలో డిప్లమా పూర్తిచేశాడు.
ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి pain లేకుండా చనిపోవడం ఎలా అంటూ తోటి విద్యార్థులతో చర్చించాడు. సోమవారం ఉదయం నలతగా ఉండడంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్ లోనే ఉండి పోయాడు. అదే రూమ్ లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారి తరగతులకు హాజరయ్యారు.
మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచరమిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురు సెల్ఫోన్లకు ‘మీకు సర్ ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ Text messageను రవితేజ పోస్ట్ చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్ లోనే ఉన్నాడు అని చెప్పారు. వెంటనే మిగతా విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు.
రెండు వైపులా తలుపులు వేసి ఉండడంతో విద్యార్థులు రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్ కు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రవితేజ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి.రవికుమార్, ఎస్ఐ ఎం శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తోటి విద్యార్థులు స్పందిస్తూ బాధ లేకుండా చనిపోవడం ఎలా అని చర్చిస్తే తాము సాధారణంగా తీసుకున్నామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడు అనుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేశవరాయనిపాలెంలో విషాదం…
కేశవరాయుని పాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అల్లంశెట్టి రవితేజ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి నుంచి సమాచారం రావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
కుటుంబ నేపథ్యం…
రేషన్ డిపో డీలర్ అయిన సూరిబాబు, రాణి ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయితేజ రాజాంలోని జిఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా.. చిన్న కుమారుడైన రవితేజ తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన రవితేజ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో సరదాగా గడిపి తిరిగి జనవరి 18వ తేదీన తాడేపల్లిగూడెం వెళ్ళిపోయాడు. రోజూ రెండుసార్లు తనకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడేవాడిని తల్లిదండ్రులు చెబుతున్నారు.
సోమవారం ఉదయం ఫోన్ చేసి ఒంట్లో నీరసంగా ఉందని కాలేజీకి వెళ్ళకుండా హాస్టల్లోనే ఉండిపోతున్నానని రవితేజ చెప్పాడు. మద్యాహ్నం 1:00 సమయంలో కాలేజీ యాజమాన్యం నుంచి రవితేజ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి రాణిప్రమీలకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత కోలుకున్న తల్లిదండ్రులు సూరిబాబు, రాణి ప్రమీలా, కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తులు బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళారు.
చిన్నతనం నుంచి రవితేజ బాగా చదివే వాడిని స్థానికులు చెబుతున్నారు. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు అంటున్నారు. లావేరు మండలం వైస్ ఎంపీపీ అలుపున రమణమ్మ, వైఎస్ఆర్సిపి నాయకులు నాయని మోహన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, అలుపున గోవిందరెడ్డి, సర్పంచ్ యాగాటి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ నాయని వెంకటేష్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.