Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి.

elderly wome died due to stray dogs attack
Author
Hyderabad, First Published Jan 30, 2019, 4:58 PM IST

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. జిల్లాలోని వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ(65) అనే వృద్ధురాలు రాత్రి  ఇంటి గడపలో నిద్రించింది.

కాగా.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కలు ఆమె దాడికి పాల్పడ్డాయి. రాముడమ్మను ఈడ్చుకెళ్లాయి. అనంతరం విచక్షణా రహితంగా దాడి చేసి పీక్కొని తిన్నాయి. దీంతో తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios