మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబే కారణమంటూ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ రాజీనామా చేయడం ఎందుకన్న ఆయన.. ముందు కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఓ సామాన్య మహిళా కార్యకర్తను నిలబెట్టి గెలుస్తామని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. 

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత అయ్యన్నది టెర్రరిస్ట్ మనస్తత్వమన్నారు. అయ్యన్నపాత్రుడి మాటలతో సమాజమే తలదించుకుందని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబే కారణమంటూ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ రాజీనామా చేయడం ఎందుకన్న ఆయన.. ముందు కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఓ సామాన్య మహిళా కార్యకర్తను నిలబెట్టి గెలుస్తామని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred