Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో దారుణం: కూతురిని ప్రేమించాడని ముక్కలు ముక్కలుగా నరికాడు

 తన కూతురిని ప్రేమించాడనే నెపంతో యువకుడిని యువతి తండ్రి దారుణంగా నరికి చంపాడు. యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. 

Dhana sekhar killed his lovers  father in Chittoor district lns
Author
Amaravathi, First Published May 28, 2021, 1:11 PM IST

చిత్తూరు: తన కూతురిని ప్రేమించాడనే నెపంతో యువకుడిని యువతి తండ్రి దారుణంగా నరికి చంపాడు. యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలోని పెంగరగుంటలో ఈ ఘటన చోటు చేసుకొంది.  పెంగరగుంట గ్రామానికి చెందిన యువకుడు ధనశేఖర్, శైలజలు రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. పెళ్లి కూడ చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ విషయమై ధనశేఖర్ ను మాట్లాడాలని శైలజ తండ్రి పిలిపించాడు. తన పొలానికి పిలిపించి ధనశేఖర్ ను హత్య చేశాడు.  ధనశేఖర్  మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నాలుగు రోజులుగా ధనశేఖర్ ఆచూకీ లేకుండా పోయాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనశేఖర్ ఫోన్ కు చివరిసారిగా శైలజ తండ్రి ఫోన్ చేశాడు. ఈ ఫోన్  సమాచారం ఆధారంగా  పోలీసులు విచారణ చేపట్టారు.శైలజ కుటుంబసభ్యులు గ్రామం విడిచిపారిపోయాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఈ గ్రామానికి సమీపంలోనే పరువు హత్య చోటు చేసుకొంది. అయితే తాజాగా మరోసారి ప్రేమ వ్యవహరంలో హత్య చోటు చేసుకోసుకోవడం మరోసారి చర్చకు కారణమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios