Asianet News TeluguAsianet News Telugu

అత్తపై సలసల కాగే నూనె పోసి హత్యాయత్నం... కసాయి కోడలి కిరాతకం

 కృష్ణా జిల్లా గుడివాడలో సీన్ రివర్సయ్యింది. ఓ కోడలే అత్తను వేధించడం కాదు ఏకంగా హత్యాయత్నానికి పాల్పడింది. 

daughter in law murder attempt on woman at gudivada akp
Author
Gudivada, First Published Jun 27, 2021, 11:49 AM IST

విజయవాడ: సాధారణంగా కోడలిని అత్తలు వేధించే ఘటనలు మనం చూస్తుంటాం. కానీ కృష్ణా జిల్లా గుడివాడలో సీన్ రివర్సయ్యింది. ఓ కోడలే అత్తను వేధించడం కాదు ఏకంగా హత్యాయత్నానికి పాల్పడింది. 

వివరాల్లోకి వెళితే... గుడివాడ మండలం మందుపాడుకు చెందిన లక్ష్మి అనే మహిళకు శివ నారాయణ అనే కొడుకు వున్నాడు. అతడికి లక్ష్మి అనే యువతికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన నాటి నుండి అత్తాకోడళ్లకు అస్సలు పడక గొడవలు జరిగేవి. 

read more  కుమార్తెకు వేధింపులు: యువకుడిని చంపిన తండ్రి

అయితే ఇటీవల కాలంలో తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వలేదని అత్తతో కోడలు గొడవపడుతోంది. ఈ క్రమంలో అత్తపై కోపంతో రగిలిపోయిన కోడలు దారుణానికి ఒడిగట్టింది. అత్త ఇంట్లో నిద్రిస్తుండగా సలసలకాగే నూనెనుఆమెపై పోసి హత్యాయత్నానికి పాల్పడింది. 

వేడివేడి నూనె ఒంటిపై పడటంతో అత్త లక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా వుందని తెలుస్తోంది. ఈ హత్యాయత్నంపై సమాచారం అందుకున్న గుడివాడ 2 టౌన్ పోలీసులు బాధిత మహిళ కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అదుపులోకి తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios