నూతన్ నాయుడి ఇంట్లో దళితుడి శిరోముండనం: వీడియో చూడండి
విశాఖపట్నంలోని పెందుర్తిలో గల నూతన్ నాయుడి నివాసంలో జరిగిన శిరోముండనం వీడీయోను సీపీ విడుదల చేశారు. సినీ నిర్మాత నూతన్ నాయుడి ఇంట్లో జరిగిన ఆ సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం: సినీ నిర్మాత నూతన్ నాయుడి నివాసంలో దళిత యువకుడికి గీండు గీయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా శనివారం విడుదల చేశారు.
దళిత యువకుడి శిరోముండనం కేసులో నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఆరుగురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే దళిత యువకుడికి శిరోముండనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
దళిత యువకుడికి శిరోముండనం చేసిన వీడియోను చూడండి...
"