Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: ఏపీలో కొత్తగా 16 కోవిడ్ -19 కేసులు, 381 చేరిన సంఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381 చేరుకున్నాయి. ఏపీలో ఆరు మరణాలు సంభవించాయి. కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

Coronavirus: 16 fresh Covid 19 cases registered in Andhra Pradesh
Author
Amaravathi, First Published Apr 10, 2020, 8:33 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది గంటల్లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరుకుంది. కొత్తగా గుంటూరు జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. పది మంది కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడిలోని ఉపాధ్యాయుడి నివాసంలో ఇద్దరికి, ఉపాధ్యాయుడి ఇంటి సమీపంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 370కి పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు ఇవీ...

అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పుగోదావరి 17
గుంటూరు 58
కడప 29
కృష్ణా 35
కర్నూలు 77
నెల్లూరు 48
ప్రకాశం 40
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 22

Follow Us:
Download App:
  • android
  • ios