ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మరణించాడు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించి క్రమంలో మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపులపాయలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ ప్రభాకర్ మరణించాడు, గుండెపోటుతో అతను మృతి చెందాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

11వ బెటాలియన్ కు చెందిన ప్రభాకర్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు వచ్చింది. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించడానికి సహచర ఉద్యోగులు ప్రయత్నించారు. 

ఆస్పత్రికి తీసుకుని వెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే ప్రభాకర్ మరణించాడు. ఈ సంఘటనతో అతని కుటుంబంలో విషాదవాతావరణం చోటు చేసుకుంది.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని యలమంచింలి కొత్తపాలెం సమీపంలో ఓ కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.