పక్క రాష్ట్రాలకూ పాకిన జగన్ మానియా....మహారాష్ట్రలో ప్రత్యక్షమైన భారీ ఫ్లెక్సీ
నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖ్యాతి తెలుగు రాష్ట్రాలను దాటి పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read ఏపీకి మూడు రాజధానులు: పవన్కు షాకిచ్చిన చిరు, జగన్ జై
అందుబాటులో ఉన్నవారు స్వయంగా వచ్చి జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతుండగా... దూరంగా ఉన్నవారు ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ తరం యువత అంతా సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
ఆయనపై అభిమానం ఎంతలా ఉందంటే ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ ఆయన జన్మదినవేడుకే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఇప్పుడు మహారాష్ట్రలో మొదలయినట్టున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీ ఒకటి వెలిసింది.
also read జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్
అందులో జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని రాసారు. వీరు ఆ ఫ్లెక్సీమీద అంతా మారాఠిలోనే రాయడం విశేషం. కింద తమ ఊరిపేరును రాసిన సదరు అభిమానులు తమను తాము జగన్ ఫాన్స్ క్లబ్ గా పేర్కొనడం కొసమెరుపు.