Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లా వైఎస్ఆర్‌సీపీలో ఆధిపత్యపోరు: ఆర్ధర్, బైరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ

జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Clashes between ysrcp workers in kurnool district lns
Author
Kurnool, First Published Feb 3, 2021, 3:58 PM IST

కర్నూల్: జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ధర్, నందికొట్కూర్ వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకొన్నారు.సమావేశానికి హాజరైన మంత్రులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నించారు.

ఈ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా ఆదిపత్యపోరు సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధు ఎంపిక సమయంలో ఘర్షణ చోటు చేసుకొంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జయరాం, ఎంపీ వేమిరెడ్డి లు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.

గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆర్ధర్ పోటీ చేసి విజయం సాధించారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గానికి బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిని ఇంచార్జీగా వైసీపీ నియమించింది. ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా సఖ్యత లేకుండా పోయింది. దీంతో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు బహిరంగంగానే సవాల్ చేసుకొంటున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios