గుంటూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ: టీడీపీ కార్యకర్తకు గాయాలు
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు తురకపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు తురకపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు.
ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పులు రాలేదు.
తాజాగా గురువారం నాడు తురకపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు. అల్లాద్దీన్పై దాడికి దిగిన ప్రత్యర్థులు పారిపోయారు. ఈ ఘటనపై అల్లాద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.