కడప జిల్లాలో బీజేపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
కడప జిల్లా అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. నలుగురు బీజేపీ కార్యకర్తలు, ఓ వైసీపీ కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు
కడప జిల్లా అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. నలుగురు బీజేపీ కార్యకర్తలు, ఓ వైసీపీ కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.