Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌ జిల్లా గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరికి గాయాలు


కర్నూల్ జిల్లా మహానంది మండలం గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థల వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

clash between two groups in Kurnool distirct lns
Author
Kurnool, First Published Jul 11, 2021, 12:24 PM IST

కర్నూల్: కర్నూల్ జిల్లాలోని మహానంది మండలం గోపవరం ఇరువర్గాల మధ్య ఆదివారం నాడుఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.స్థల వివాదం విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఈ ఘర్షణ సమయంలో ఓ వ్యక్తి పారతో మరో వ్యక్తి తలపై కొట్టాడు. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.   గాయపడిన వ్యక్తిని స్థానికులు  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

స్థలం విషయంలో  ప్రాణాలు కోల్పోయేలా దాడులు చేసుకొంటున్న ఘటనలు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థల వివాదం విషఁయంలో రెవిన్యూ అధికారులు సక్రమంగా వ్యవహరిస్తే వివాదాలు చోటు చేసుకొనే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios