కర్నూల్ జిల్లా గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరికి గాయాలు
కర్నూల్ జిల్లా మహానంది మండలం గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థల వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
కర్నూల్: కర్నూల్ జిల్లాలోని మహానంది మండలం గోపవరం ఇరువర్గాల మధ్య ఆదివారం నాడుఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.స్థల వివాదం విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణ సమయంలో ఓ వ్యక్తి పారతో మరో వ్యక్తి తలపై కొట్టాడు. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్థలం విషయంలో ప్రాణాలు కోల్పోయేలా దాడులు చేసుకొంటున్న ఘటనలు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థల వివాదం విషఁయంలో రెవిన్యూ అధికారులు సక్రమంగా వ్యవహరిస్తే వివాదాలు చోటు చేసుకొనే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.