Asianet News TeluguAsianet News Telugu

అమరావతి అసైన్డ్ భూముల కేసు: టీడీపీ హయంలో జీవోలపై సీఐడీ ఆరా

అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

CID gathers clinching evidence in Amaravati land scandal lns
Author
Guntur, First Published Mar 28, 2021, 2:25 PM IST

అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు జారీ చేసిన జీవోలతో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఈ ఏడాది  ఫిబ్రవరిలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.టీడీపీ హయంలో జీవోల జారీకి సంబంధించిన ఆధారాలను సీఐడీ సేకరించే ప్రయత్నం చేస్తోంది.అసైన్డ్ , లంక భూముల జీవోల వెనకున్న నోట్ ఫైల్స్ ను  సీఐడీ సేకరిస్తోంది.

రైతుల నుండి సేకరించిన ఆధారాలు, నోట్ ఫైల్స్ ను కోర్టుకు  సీఐడీ అందజేయనుంది.భూముల అక్రమాల్లో నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్స్ ఉందంటోన్న సీఐడీ అధికారులు.అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను కూడ సమర్పించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios