దళిత యువకుడు మృతి: చంద్రబాబుకు నోటీసు పంపిన చిత్తూరు పోలీసులు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) నుంచి చంద్రబాబుకు సీఆర్పీసీ 91 నోటీసులు జారీ చేశారు.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) నుంచి చంద్రబాబుకు సీఆర్పీసీ 91 నోటీసులు జారీ చేశారు.
పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆగస్ట్ 27 న దినపత్రికల్లో కథనాన్ని నోటీసులో ప్రస్తావించారు.
మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని నోటీసులో చంద్రబాబును కోరారు మదనపల్లి పోలీసులు. నోటీసు అందిన వారం రోజుల్లోగా, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబును కోరారు.