మంచివాడు మా అన్నయ్య... మాతోనే ఉంటాడు
చిరంజీవి తెలుగుదేశం తాయిలాలాకు లొంగడని, కాంగ్రెస్ లోనే చిరకాలం ఉంటాడని పిసిసి ప్రెసిడెంట్ రఘువీరా ఆశిస్తున్నారు
మంచి వాడులో మా చిరంజీవి ... చిరకాలం మా తోనే ఉంటాడోయి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి హైదరాబాద్ కొచ్చి పాడుతున్నారు.
ఈ మధ్య రంజీవిని టిడిపి తాయిలాలతో కొనేసిందనే వూహాగానాలు ప్రబలాయి. కొనడం అంటే ఎలా? చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు ట్రూజెట్ అనే విమానసంస్థ ఉంది. అది ఆంధ్రలో విమానాలు నడపుతూ ఉంది.
ఇపుడున్న పరిస్థితుల్లో అది లాభదాయకం కాదు,సరిగదా లాస్ వచ్చే ప్రతిపాదన. అందువల్ల హీరో వ్యాపారిస్థుడిని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ఆయన కంపెని రు. 5 కోట్ల (వయబిలిటి గ్యాప్ ఫండింగ్ ) ప్రకటించారు. ముందు ముందు ఇలాంటి వెన్నో అందించి చిరంజీవి కుటుంబానికి చేయూత నిచ్చి కాంగ్రెస్ చేతినుంచి మెగాస్టార్ ని లాక్కుంటాడని బాగా ప్రచారమవుతూ ఉంది.
చాలా మంది ఇదొక లోతయిన ’ కాపు నిర్ణయం’ ని దీర్ఘాలు కూడా తీస్తున్నారు. చిరంజీవి సకుటుంబ సమేతంగా తెలుగుదేశంలో చేరతాడని కూడ ప్రత్యేక వార్తలను టివిలు ప్రసారం చేశాయి. కష్టపడే నేతలున్నా, గ్లామరున్న హీరోల కొరత ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది తీరని లోటు అవుతుంది. అందువల్ల ఈ రాజకీయ ప్రచారాన్నివెంటనే ఖండించాల్సి వచ్చింది. దీనికోసం రఘువీరా రెడ్డి మాజీ మంత్రి శైలజానాధ్, డాక్టర్ తులసి రెడ్డి, గిడుగు రుద్రరాజు వంటి మార్బలంతో హైదరాబాద్ కొచ్చి ఈ చిరంజీవి కడదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నారని ప్రకటించారు.
పార్టీ మారతారని వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 150వ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న కారణంగానే ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో మెగాస్ఠార్ పాల్గొనడం లేదని రఘువీరా సర్ది చెప్పుకున్నారు.