చంద్రబాబు నైజాన్ని పవన్ తెలసుకున్నారు
- టీడీపీ అవినీతికి పాలుపడుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.
- పవన్ పిలుపుతో చంద్రబాబు నిజాయితి ఎంతో ప్రజలకు బాగా అర్ధమైందన్న శ్రీకాంత్.
- పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానించారు.
టీడీపీ అవినీతికి పాలుపడుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ నంద్యాల ఎన్నికలో ఆ పార్టీకి దూరంగా ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. మూడున్నరేళ్ల క్రితం ఎన్నికల్లో టీడీపీ సపోర్టు చేసి, నంద్యాల,కాకినాడ ఎన్నికకు మాత్రం పవన్ ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన అభిమానులు గమనించాలన్నారు. పవన్ పిలుపుతో చంద్రబాబు నిజాయితి ఎంతో ప్రజలకు బాగా అర్ధమైందని అన్నారు శ్రీకాంత్ రెడ్డి. గురువారం నంద్యాల ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ టీడీపీ పై విమర్శల వర్షం కురిపించారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానించారు, పవన్ కళ్యాణ్ కి బాబు నిజ స్వరూపం ఇప్పడు అర్ధమైందని ఆయన అన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ లాగే మిగతా టీడీపీ నేతలు కూడా బాబుకు దూరమవుతారని ఆయన జ్యోసం చెప్పారు.
చంద్రబాబు వైసీపి నేతలను ప్రలోభపెట్టి పిరాయింపులకు పాలుపడినట్లు ఆయన ఆరోపించారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో తక్షణం రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీలోకి వచ్చిన శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి మరీ పార్టీలో చెర్చుకున్నట్లు ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు విలువలు లేవని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీకి ప్రజల అభివృద్ది పట్టదని శ్రీకాంత్ ఆరోపించారు . ప్రజలను మభ్యపెట్టడమే పచ్చపార్టీ నేతల నైజాంగా ఆయన ఎద్దేవా చేశారు.