Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యం ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. 

chandrababu naidu win global agriculture leadership award
Author
Amaravathi, First Published Oct 8, 2018, 8:34 PM IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యం ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అందజేయనున్నారు. 

వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ ఈ అంశాలను పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. కమిటీ పరిశీలించిన అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో అవార్డుకు చంద్రబాబు నాయుడును ఎంపిక చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios