Asianet News TeluguAsianet News Telugu

అక్రమాస్తులపై ఏసీబీ కేసు: చంద్రబాబు స్పందన ఇదీ

అక్రమాస్తుల కేసు విషయమై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు.అక్రమాస్తుల కేసు విషయంలో స్టే ఎత్తివేసినట్టుగా తనకు పూర్తి సమాచారం లేదని చెప్పారు.

Chandrababu Naidu Responds acb disproportionate assets case
Author
Eluru, First Published Nov 19, 2019, 3:38 PM IST


ఏలూరు:అక్రమ ఆస్తుల వ్యవహారంలో స్టే రద్దుపై పూర్తి సమాచారం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  చెప్పారు.మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి  జిల్లా తణుకులో  పార్టీ నేతలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై గతంలో 26 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అంతేకాదు ఈ కేసుల్లో తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఈ కేసు విషయాన్ని న్యాయవాదులు చూసుకొంటారని చంద్రబాబునాయుడు తెలిపారు.  

సెక్యూరిటీ సాకుతో తనను కార్యకర్తలను కలుసుకోకుండా పోలీసులు అడ్డుకొంటున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. తణుకులో ఆశా వర్కర్లకు సంఘీభావం చెప్పేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రామానాయుడుపై కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

Also read:ఏసీబీ కోర్టు షాక్: చంద్రబాబు ఆస్తులపై విచారణ

పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ వేధింపులు ఎక్కువైనట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు.  పశ్చిమగోదావరి జిల్లాలో ఏనాడూ కూడ ఈ పరిస్థితిని తాను చూడలేదన్నారు.

 తణుకులో తాను పర్యటించనున్నట్టుగా 10 రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. 30 సీ యాక్ట్ అమల్లోకి తీసుకురావడంపై  చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios