అక్రమాస్తులపై ఏసీబీ కేసు: చంద్రబాబు స్పందన ఇదీ
అక్రమాస్తుల కేసు విషయమై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు.అక్రమాస్తుల కేసు విషయంలో స్టే ఎత్తివేసినట్టుగా తనకు పూర్తి సమాచారం లేదని చెప్పారు.
ఏలూరు:అక్రమ ఆస్తుల వ్యవహారంలో స్టే రద్దుపై పూర్తి సమాచారం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ నేతలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై గతంలో 26 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అంతేకాదు ఈ కేసుల్లో తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఈ కేసు విషయాన్ని న్యాయవాదులు చూసుకొంటారని చంద్రబాబునాయుడు తెలిపారు.
సెక్యూరిటీ సాకుతో తనను కార్యకర్తలను కలుసుకోకుండా పోలీసులు అడ్డుకొంటున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. తణుకులో ఆశా వర్కర్లకు సంఘీభావం చెప్పేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రామానాయుడుపై కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.
Also read:ఏసీబీ కోర్టు షాక్: చంద్రబాబు ఆస్తులపై విచారణ
పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ వేధింపులు ఎక్కువైనట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏనాడూ కూడ ఈ పరిస్థితిని తాను చూడలేదన్నారు.
తణుకులో తాను పర్యటించనున్నట్టుగా 10 రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. 30 సీ యాక్ట్ అమల్లోకి తీసుకురావడంపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు.