Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్ : అనుభవం ఉంటే అవినీతి పరుడిని అరెస్టు చేయకూడదా?.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్కిల్ పేరుతో రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు, హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయంటూ రాష్ట్ర, విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. 

Chandrababu Arrest :  Peddireddy Ramachandra Reddy Sensational Comments - bsb
Author
First Published Sep 9, 2023, 1:15 PM IST

స్కిల్ పేరుతో రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు, హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయంటూ రాష్ట్ర, విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. 

అమరావతి : చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై రాష్ట్ర, విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  స్కిల్ పేరుతో  రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు అంటూ విరుచుకుపడ్డారు. హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

తెలుగు ప్రజలకు సేవ చేయకుండా భూమిపై నన్ను ఏ శక్తీ ఆపలేదు - చంద్రబాబు నాయుడు

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. అనుభవం ఉంటే అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా? కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారన్నారు. 

మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ- ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది..? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడు. 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయి. సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు.. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారు.

షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారు. హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి. ఆ డబ్బులు అన్ని చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే... అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే... చంద్రబాబు సిఐడిని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది.

ఐటి నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దోచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది. చంద్రబాబు బంధువు, బీజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ళకు స్కాం కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం.. అన్నారు.

పురంధేశ్వరి గారు ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా? లేదా చెప్పాలి అని డిమాండ్ చేశారు. అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరు అన్నారు. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు... ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. 

న. ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబుకు మద్దతు తెలిపింది. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు.సిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్ స్కాంల్లో కూడా అవకతవకలు జరిగాయి. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసిపి కార్యకర్త కూడా లేరు. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరులోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే..... పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios