వైసీపీలోకి చలమలశెట్టి సునీల్: కండువా కప్పి అహ్వానించిన జగన్ (వీడియో)
టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారంనాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కండువా కప్పి సునీల్ ను పార్టీలోకి అహ్వానించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారంనాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీత పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెద్దాపురం వైసీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీడియో చూడండి....
"