హక్కుల సాధన కోసమే దీక్ష.. బుట్టా రేణుక
ఏపీకి రావాల్సిన హక్కుల కోసమే తాము ఢిల్లీ లో తాము దీక్ష చేస్తున్నామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు.
ఏపీకి రావాల్సిన హక్కుల కోసమే తాము ఢిల్లీ లో తాము దీక్ష చేస్తున్నామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. సోమవారం ఢిల్లీలో టీడీపీ నేతలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
విభజన హక్కుల సాధన కోసం గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆమె చెప్పారు. హక్కుల సాధన కోసమే చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ మూడు రోజులు జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలను అమలు చేయాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.