అన్న క్యాంటీన్లకు భారీ విరాళం
పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్లో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లకు మద్దతు లభిస్తోంది. పేద ప్రజలకు రూ.5కే భోజనం అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కాగా..పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్లో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా మండల మాట్లాడుతూ, నవ్యాంధ్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు పేదల ఆకలిని తీర్చే మరో బృహత్తర కార్యక్రమం అన్న క్యాంటీన్కు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ, బంధు మిత్రుల సహకారంతో తిరుమలకు కూరగాయలను పంపుతున్నారు.