ఓ దాబాలో చెలరేగిన గొడవ హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని చెక్కతో కొట్టడంతో మృతి చెందింది.
నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణ హత్య జరిగింది. ఓ దాబాలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఒక వ్యక్తి మరోవ్యక్తిని చెక్కతో కొట్టడంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అశోక్ అనే వ్యక్తిని మరో వ్యక్తి చెక్కతో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడివారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ లో నమోదైన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
