Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకి ఊరట.. పసుపు-కుంకుమకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  

Breaking: Delhi HC gives green signal to Pasupu-Kumkuma
Author
Hyderabad, First Published Apr 5, 2019, 3:45 PM IST


ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పెన్షన్లు కూడా అందజేస్తోంది.

అయితే... ఈ పథకాలు ఎన్నికలను ప్రభావం చేస్తాయని వైసీపీ నేతలు ఆరోపించారు. జనచైతన్య వేదిక అనే సంస్థ  దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా..దీనిపై కోర్టు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios