చంద్రబాబుకి ఊరట.. పసుపు-కుంకుమకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పెన్షన్లు కూడా అందజేస్తోంది.
అయితే... ఈ పథకాలు ఎన్నికలను ప్రభావం చేస్తాయని వైసీపీ నేతలు ఆరోపించారు. జనచైతన్య వేదిక అనే సంస్థ దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా..దీనిపై కోర్టు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.
పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు.