Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ భిక్ష పెట్టిన వారికే జగన్ వెన్నుపోటు...: బోండా ఉమ ఫైర్

సమైక్యరాష్ట్రంతో పాటు కొత్తగా ఏర్పడిన ఏపీలో కూడా చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధిని, టీడీపీ అమలుచేసిన సంక్షేమ పథకాలను మరే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. 

bonda uma sensational comments on ys jagan
Author
Vijayawada, First Published Sep 2, 2020, 9:39 PM IST

 విజయవాడ: తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ముద్ర శాశ్వతమని...చంద్రబాబు నాయుడి పనితీరు, అభివృద్ధి అనేవి ఎన్నటికీ చెరిగిపోవనే సత్యాన్ని అసమర్థ వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 

సమైక్యరాష్ట్రంతో పాటు కొత్తగా ఏర్పడిన ఏపీలో కూడా చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధిని, టీడీపీ అమలుచేసిన సంక్షేమ పథకాలను మరే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి, సంక్షేమాలేనని, వాటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. సమైక్య రాష్ట్రానికి, విభజనానంతర రాష్ట్రానికి తల్లి, పిల్ల కాంగ్రెస్ లు ఏం చేశాయో చెప్పగలరా?  అంటూ ప్రశ్నించారు. 

''1995కు ముందు హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో, అప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధేమిటో చరిత్రలోకి వెళ్లి తెలుసుకోండి. చంద్రబాబు హాయాంలో సైబరాబాద్ నిర్మాణంతో భాగ్యనగరం జాతీయస్థాయి నగరమైందని  వైసీపీ నేతలు గ్రహించాలి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ల నిర్మాణం ఎవరు చేశారో తెలుసుకోండి'' అని సూచించారు. 

''ఇక కొత్త రాష్ట్రంలో బెజవాడ ఫ్లైఓవర్, అమరావతి, హైకోర్టు, సచివాలయం, పట్టిసీమ, పోలవరం ఎవరు నిర్మించారో తెలియదా? చంద్రబాబు కట్టిన నిర్మాణాల్లోనే ఉంటూ, ఆయన కల్పించిన నీడన బతుకుతూ ఆయనపైనే విమర్శలు చేస్తారా? విట్, ఎస్ఆర్ఎం, అమృతామయి, ఎయిమ్స్ వంటి వైద్య, విద్యారంగ సంస్థలను తీసుకొచ్చింది ఎవరు?'' అంటూ చంద్రబాబును కొనియాడారు. 

read more  అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించిన చంద్రబాబు (వీడియో)

''ఉభయ తెలుగురాష్ట్రాల అభివృద్దిలో చంద్రబాబునాయుడి ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిది.  కళ్లకు కట్టినట్లు నిర్మాణాలు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటే గ్రాఫిక్స్ అంటూ సిగ్గులేకుండా విషప్రచారం చేస్తారా? వైసీపీ, కాంగ్రెస్ లు అసాధ్యమన్న దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చంద్రబాబు పాలనలో కాదా? 25ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారనే వారు కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి'' అని మండిపడ్డారు. 

''కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి అవినీతి కారణంగా వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ రాష్ట్రానికి రాకుండా పారిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే  కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చారు.
 టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కియా కార్ల కంపెనీ యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అవినీతికోసం వేధిస్తున్నారు.  దాంతో సదరు కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లే ఆలోచన చేస్తోంది. ఈవిధంగా ఉన్న దాన్ని నాశనం చేయడం తప్ప, వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏవిధమైన అభివృద్ధిచేసింది?'' అంటూ నిలదీశారు. 

''కేవలం ఈ 15నెలల్లోనే పోలవరం సహా రాష్ట్రంలో ఎక్కడా వీసమెత్తు పనిచేయని వైసీపీ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతోంది. రాష్ట్రంలోని అనేక
 సాగు, తాగునీటి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కక్కుర్తితో నిలిపేశారు.
 చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణాలను ఈప్రభుత్వం పూర్తిచేసుంటే అదే రాష్ట్రానికి పాడికుండలా మారి ప్రజల కష్టాలు తీర్చేది. అటువంటి రాజధానిని నాశనం చేయడం కోసం వేలకు వేలకోట్ల ప్రజాధనాన్ని కోర్టులపేరుతో, మూడు రాజధానులంటూ వృథాచేస్తోంది జగన్ కాదా?'' అని మండిపడ్డారు.

''రూ.2వేల పింఛన్ రూ.3వేలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం 3నెలలైనా దాన్ని పెంచలేదు. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా చంద్రబాబు. వాటికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. టీడీపీ హాయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ తరుపున ఎవరు చర్చకు వస్తారో రావాలి'' అని సవాల్ విసిరారు. 

''అన్నంపెట్టిన కాంగ్రెస్ కు, రాజకీయ భిక్షపెట్టిన సోనియాగాంధీకి ఒకటికి పది వెన్నుపోట్లు పొడిచింది వైసీపీ అధినేత జగన్ కాదా? 
ఎన్టీఆర్ మరణానంతరం తెలుగుదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న కొన్ని దుష్టశక్తులనుంచి చంద్రబాబు ఆనాడు టీడీపీని కాపాడారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆ తరువాత కూడా ప్రజలఆశీస్సులతో చంద్రబాబు  పలుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ మాదిరి కుట్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తెలియదు'' అన్నారు. 

''అధికారంలోకి వచ్చిన  15నెలల్లో లక్షకోట్ల అప్పు తేవడం తప్ప వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలుగురాష్ట్రాల్లో ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాయి'' అని బోండా ఉమ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios