సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద చోటు చేసుకుంది. గల్లంతైనవారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ నేపథ్యంలో వలస కూలీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వలస కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందినవారని తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.