Asianet News TeluguAsianet News Telugu

‘చంద్రబాబు కుట్ర పనిచేయలేదు.. తెలుగువారే గెలిపించారు’

ట్విట్టర్ లో చంద్రబాబుపై నిప్పులు  చెరిగిన రాంమాధవ్

bjp leader ram madhav fire on ap cm chandrababu over karnataka elections

కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రాంమాధవ్  అన్నారు. మంగళశారం కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలౌన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలో   బీజేపీ నేత రాం మాధవ్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు.  కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా కూడా హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ పేర్కొన్నారు. దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios