సినిమా పెద్దలకు బడ్జెట్ ను బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని ‘జూటాహామీ’ ఇచ్చిన ‘జూమ్లానాయక్’ జగన్... అంటూ బీజేపీ నేత లంకా దినకర్ ఏపీ సీఎం మీద విరుచుకుపడ్డారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీలో థియేటర్ల వద్ద తనిఖీలను ఎద్దేవా చేశారు.

అమరావతి : Bhimla Nayak సినిమా విడుదల నేపథ్యంలో Movie ticket rates వివాదం ఏపీలో అగ్గిపెడుతోంది. Pawan Kalyan మీద కక్ష సాధింపు గానే జగన్ వ్యవహరిస్తున్నాడని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Benefit showలను అడ్డుకోవడం, టికెట్ రేట్లను తగ్గించడం ఇప్పుడు మరింత ముదురుతోంది.

ఏపీలో నెలకొన్న వివాదం మీద మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ప్రముఖులతో కలిసి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమపై శీతకన్ను వేయద్దంటూ.. జగన్ ను బతిమిలాడారు. దీనిమీద జగన్ సానుకూలంగా స్పందించినా.. ఇంకా టికెట్ రేట్ల విషయం, బెనిఫిట్ షోల మీద ఇదమిద్ధంగా ఎలాంటి నిర్ణయమూ బైటికి రాలేదు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ నేడు రిలీజవ్వడంతో.. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కక్ష సాధింపు చేస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత Lanka Dinkar జగన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ను రాష్ట్రంలో అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న ‘జూమ్లా నాయక్’ జగన్. ఈ ప్రభుత్వం మద్యం కొట్టు, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, చేపలకొట్టుతో మొదలుపెట్టి.. ‘సినిమా టిక్కెట్ల’ వరకు వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. ‘రెవెన్యూ అధికారుల విలువైన సమయం థియేటర్ల బాత్రూంలకి అంకితం చేసిన ఘటన సీఎం జగన్ సాధించారని’ వ్యంగ్యాస్తాలు వదిలారు. అంతేకాదు.. సినిమా పెద్దలకు బడ్జెట్ ను బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని ‘జూటాహామీ’ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కోసం ఇంత ప్రహసనం అవసరమా? పాలకుడు అంటే అందరినీ సమానంగా చూడాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే టీటీడీ భారీగా పెంచిన స్వామివారి సేవల టిక్కెట్ల ధరలు తగ్గించాలి.. అంటూ డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని.. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ JC Prabhakar Reddy ప్రశ్నించారు. తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం film industryకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదేవిధంగా ప్రోత్సహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కక్ష సాధింపు చర్యలు వల్ల andhrapradeshలో సినీపరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతే కానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి Movie theatersపై పడ్డారు.

లా అండ్ ఆర్డర్ ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత Pawan Kalyan నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్ హాజరవడంతో పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కువగానే ఉంటుంది.

అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు. సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.

Scroll to load tweet…