Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బీజేపీ పరిస్థితిపై విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో  తాను విశాఖపట్టణంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక స్పష్టం చేస్తానని ఆయన ప్రకటించారు.

bjlp leader vishnu kumar raju sensational comments on bjp in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 11, 2019, 4:37 PM IST


విశాఖపట్టణం:వచ్చే ఎన్నికల్లో  తాను విశాఖపట్టణంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక స్పష్టం చేస్తానని ఆయన ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో  బీజేపీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదన్నారు. బీజేపీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని  విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత కారణాలతో కొందరు నేతలు బీజేపీని వీడారని ఆయన అభిప్రాయపడ్డారు. 

వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి అనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టలేదు. విష్ణుకుమార్ రాజు కూడ బీజేపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో  విష్ణుకుమార్ రాజు  ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోపీడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీలో కీలకమైన బీజేపీ నేతలు  కొందరు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం  జోరుగా సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios