Asianet News TeluguAsianet News Telugu

మంత్రులు బొత్స, మోపీదేవీలకు చేదు అనుభవం

మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా... బొత్స సత్యానారాయణ, మోపీదేవి వెంకటరమణలు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు

bitter experience to ministers botsa and mopidevi
Author
Hyderabad, First Published Oct 26, 2019, 10:03 AM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యానారాయణ, మోపీదేవీలకు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లిన వారిని కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక కొరతపై మంత్రులను భవన నిర్మాణ కార్మికులు నిలదీశారు.  మీకు ఓటు వేశాము... మాకు ఇసుక ఇవ్వండి అంటూ కార్మికులు వారిని నిలదీశారు. 

మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా... బొత్స సత్యానారాయణ, మోపీదేవి వెంకటరమణలు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మోపీదేవి మాట్లాడుతూ...  భూగర్భ డ్రైనేజీ పనులు గత ప్రభుత్వంలో దారుణంగా నిర్వహించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పద్ధతి లేకుండా పనులు అప్పగించారని మోపీదేవి అన్నారు. 

AlsoRead రాజీనామా చేసి వస్తేనే....వల్లభనేని వంశీతో జగన్...

ఇదిలా ఉండగా... ఏపీలో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో.. భవన నిర్మాణ  సంస్థలు. కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే... ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. 

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ ఉన్నతాధికారులతో సచివాలయంలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు

నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం వల్లే ఇసుకకు కొరత ఏర్పడిందని అధికారులు సీఎం కు తెలియజేశారు. 55 రోజలు నుంచి గోదావరి, 71 రోజుల నుంచి కృష్ణానది పొంగి ప్రవహిస్తున్నాయని తెలియజేశారు. 

మరోవైపు తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 400–500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని దీంతో వంశధార, పెన్నా నదుల్లో కూడా వరద ఉదృతి  పెరిగిందన్నారు. ఇప్పటికీ భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయని తెలిపారు. ఫలితంగా ఇసుక లభ్యత ఉండే ప్రాంతాలనుంచి తవ్వకాలు చేయలేకపోతుని  అధికారులు వివరించారు.

ఇసుక రీచ్‌ల వద్దకు వాహనాలుకూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అధికారులు నివేదించారు. 200కుపైగా రీచ్‌లను గుర్తిస్తే ప్రస్తుతం 69 చోట్లనుంచే ఎంతోకొంత వెలికి తీయగలుగుతున్నామన్నారు. 

అయితే ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకుంటే.. ఎక్కడ సాధ్యమవుతుందో, ఆయా ప్రాంతాలను గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులు సూచించారు. గ్రామ సెక్రటేరియట్‌ల ద్వారా ఈ తవ్వకాలు జరిగితే అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు.. ఈ విషయంలో గ్రామసచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలని ఆదేశించారు.

 మూడు నెలలకాలానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అవినీతి లేకుండా, పర్యావరణానికి నష్టం రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.  

ముఖ్యమంత్రి ఆదేశాలపై 3 నెలల కాలానికి అధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు.ఇసుక తవ్వకాలు, రవాణాపై  వెలువడిన తాజా మార్గదర్శకాలిలా ఉన్నాయి. ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం పలు సూచనలు ఇచ్చింది. ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడంతో అందుబాటులో వాగులూ, వంకలూ, ఇతరత్రా చిన్న నదుల్లో ఇసుక లభ్యతను గుర్తించనున్నారు. గ్రామాల వారీగా గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. గ్రామ సచివాలయంలో చెల్లింపు చేసి ఆ ఇసుకను పొందే అవకాశం కల్పించారు.

గుర్తించిన రీచ్‌ల్లో పర్యవేక్షణ భాద్యతలను గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్లకు అప్పగించనుంది. రవాణాచేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణాన్ని వాలంటీర్లు  రికార్డు చేయనున్నారు. ఏపీ వాల్టా చట్టానికి అనుగుణంగా తవ్వకాలు జరిగేలా సమన్వయపరచనున్న ఏపీఎండీసీని ఆదేశించారు.

రవాణాచేస్తున్న వాహనానికి గ్రామ సెక్రటేరియట్‌ ఇన్‌ఛార్జి ఎస్‌–3 ఫాంను జారీచేయనున్నారు. వారికి కేవలం డూప్లికేట్‌ రశీదు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ ఫాంను వాడినా, వాడకున్నా కాలపరిమితి 48 గంటలే వుండనుంది. ఒకవేళ వాడకపోయినా డబ్బు తిరిగి చెల్లించరు.అంతేకాదు.. తిరిగి వాడుకునేందుకూ వీలుకాదు. 

ఇసుకను రవాణాచేస్తున్న ట్రాక్టర్లకు 20 కి.మీ వరకే అనుమతివ్వనున్నారు. ఇసుక తరలింపు, నిల్వలో అక్రమాల నిరోధానికి తారుమారుచేయలేని సెక్యూరిటీ ఫీచర్లతో ఎస్‌–3 ఫాంలను రూపొందించారు.  

ఏపీఎండీసీ వాణిజ్య అవసరాలకు కాకుండా స్థానిక అవసరాలకు ఈ ఇసుకను వినియోగించాలని షరతు  విధించారు. వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని ఆదేశించారు. అలాంటి నిల్వచేసే వ్యక్తులపై తగిన చర్యలు గ్రామ సచివాలయమే తీసుకుంటుందన్నారు.

ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాల్లో ఎలాంటి యంత్రాలను వినియోగించరాదన్నారు. కేవలం మానవ వనరులను మాత్రమే వినియోగించాలని సూచించారు. సరఫరా చేస్తున్న ఇసుకకు సంబంధించి వినియోగాన్ని గ్రామ సచివాలయమే పరిశీలించనుంది. ఇసుక లభ్యత కోసం తీసుకున్న పై తాజా నిర్ణయాలు 3 నెలల కాలంవరకే అమలవుతాయని పేర్కొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios