ప్రకృతి అందాలకు నిలయమైన అరకు లోయలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అరకు ఒకటి. అటవీప్రాంతాల్లో వుండే గిరిజన ఓటర్లే ఇక్కడ గెలుపోటములను శాసించేది. దీంతో ప్రధాన పార్టీలు కూడా మెజారిటీ గిరిజన, ఆదివాసి వర్గాలకే టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అరకులో అభ్యర్ధుల ఎంపికకే పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. దీన్నిబట్టే ఇక్కడ ఫైట్ ఎంత టఫ్ గా వుందో అర్థమవుతోంది.
అరకు రాజకీయాలు :
అరకు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైసిపిలో అరకు అభ్యర్థి ఎంపిక కోసం సుధీర్ఘ కసరత్తు జరిగింది. అరకులో కొండదొర సామాజికవర్గ ఓటర్లు దగ్గరదగ్గర లక్షమంది వున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి అరకు సీటు కేటాయించాలని వైసిపి భావించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న చిట్టి పాల్గుణకు కాకుండా ఎంపీ గొడ్డేడి మాధవికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది వైసిపి. అయితే అరకు వైసిపి నాయకులు మాధవిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించారు. ఆ స్థానంలో స్థానిక నాయకుడు మత్స్యలింగం ను నియమించింది.
ఇక మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రావణ్ కుమార్ ను గతంలో టిడిపి మంత్రిపదవి ఇచ్చింది. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రావణ్ ను బరిలోకి దింపింది. కానీ అతడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈసారి శ్రావణ్ ను పక్కనబెట్టిన టిడిపి సియారి దొన్నుదొర ను బరిలో దింపింది.
అరకు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ముంచింగిపుట్టు
2. పెడబయలు
3. డుంబ్రిగూడ
4. హుకుంపేట
5. అనంతగిరి
6. అరకు లోయ
అరకు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,20,893
పురుషులు - 1,08,190
మహిళలు - 1,12,698
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
అరకు అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక కోసం వైసిపి తర్జనభర్జన పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణను కాదని గొడ్డేటి మాధవిని... ఆ తర్వాత ఆమెను కూడా కాదని మత్స్య లింగం ను అరకు ఇంచార్జీగా నియమించింది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ సియ్యారి దొన్నుదొరను అరకులో పోటీకి నిలిపింది. 2019 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండోస్థానంలో నిలిచాడు దొన్నుదొర. దీంతో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ ను పక్కనబెట్టి దొన్ను దొరనే ఈసారి తమ అభ్యర్థిగా ప్రకటించింది టిడిపి.
అరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,57,575 (71 శాతం)
వైసిపి - చెట్టి పాల్గుణ - 53,101 (33 శాతం) - 25,441 ఓట్ల మెజారిటీతో విజయం
స్వతంత్ర అభ్యర్థి - దొన్నుదొర సియ్యారి - 27,660 (17 శాతం) - ఓటమి
టిడిపి - కిడారి శ్రావణ్ కుమార్ - 19,929 (12 శాతం)
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,50,109 (70 శాతం)
వైసిపి - కిడారి సర్వేశ్వరరావు - 63,700 (43 శాతం) - 34,053 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - సివేరి సోమ - 29,647 (20 శాతం) - ఓటమి