Asianet News TeluguAsianet News Telugu

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం: విచారణకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఆదేశం

సీఎం క్యాంప్  కార్యాలయం  సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై  కాకినాడ  ఎస్పీని  విచారణ  చేసి నివేదిక ఇవ్వాలని మహిళా  కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి  పద్మ  ఆదేశించారు.
 

 AP Women Commission Chairperson Orders To Probe  On Woman  To  Suicide attempt near  CM Camp Office
Author
First Published Nov 4, 2022, 5:28 PM IST


అమరావతి:ఆంద్రప్రదేశ్ సీఎం  వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో  ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించిన  మహిళ కేసులో నివేదిక ఇవ్వాలని  కాకినాడ ఎస్పీని ఏపీ  మహిళా  కమిషన్  చైర్  పర్సన్  వాసిరెడ్డి సద్మ శుక్రవారంనాడు ఆదేశించారు.

ఈ నెల  2వ  తేదీన సీఎం ను కలిసేందుకు  ఆ మె క్యాంప్ కార్యాలయం  సమీపానికి  వచ్చారు.సీఎం  కలిసే అవకాశం లేకపోవడంతో  ఆమె ఆత్మహత్యాయత్నం  చేసింది.  వెంటనే ఆమెను పోలీసులు  ఆసుపత్రికి  తరలించారు. తన  కూతురు  అనారోగ్య కారణాలతో  తన ఇంటిని  విక్రయించుకొనే ప్రయత్నం  చేస్తే కొందరు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపిస్తుంది. 

ఈ విషయమై ఫిర్యాదు  చేసినా ఫలితం  లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం  చేసినట్టుగా  మీడియాలో  వార్తలు వచ్చాయి. ఈ  విషయమై సుమోటోగా  తీసుకుంది  రాష్ట్ర మహిళ  కమిషన్. ఈ ఘటన కు  సంబంధించిన అంశంపై  నివేదిక ఇవ్వాలని  కాకినాడ ఎస్పీని  మహిళా కమిషన్ ఆదేశించింది. 

also read:తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో మహిళా ఆత్మహత్య యత్నం.. ఏం జరిగిందంటే..?

సీఎంక్యాంప్ కార్యాలయం సమీపంలో  మహిళ ఆరుద్ర ఆత్మహత్యాయత్నం  చేసిన  ఘటనపై  డీజీపీ  కార్యాలయం  కూడ  ఇదివరకే  ఓ  ప్రకటనను విడుదల చేసింది. మహిళ ఆరోపణలు చేసిన కానిస్టేబుల్  బదిలీ చేసినట్టుగా కూడ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.  ఈ  అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని  మహిళా కమిషన్ఁఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios