Asianet News TeluguAsianet News Telugu

నీ తండ్రి, తాత వల్లే కాలేదు...నీవల్లేం అవుతుంది జగన్ రెడ్డి: అచ్చెన్న ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 36గంటల దీక్షలో పాల్గొని ప్రసంగించిన అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

ap tdp president atchannaidu serious on cm ys jagan
Author
Amaravati, First Published Oct 21, 2021, 12:05 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీని భూస్ధాపితం చేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకుంటున్నట్లున్నారేమో... అది తన తండ్రి, తాత వల్లే కాలేదని గుర్తుంచుకోవాలని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ... దీన్ని జగనే కాదు ఎవ్వరూ ఏం చేయలేరని atchannaidu అన్నారు.  

వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 36గంటల దీక్షలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... YCP అధికారంలోకి వచ్చిన నాటినుంచి TDP నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. అధికారాన్ని ఉపయోగించి టిడిపి ఆర్దిక మూలాలను దెబ్బతీసినా టీడీపీ శ్రేణులు భయపడకుండా వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నారు అన్నారు. 

''వైసీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దుష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ys jagan, డీజీపీ goutham sawang కలిసి ఇదివరకే చంద్రబాబు ఇంటిపై దాడి చేయించారు. దాన్ని దైర్యంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు వైసీపీ రౌడీ మూకలు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. వైసీపీ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలపై పట్టాభిరాం ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై టిడిపి ఆపీసుపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడు జరగలేదు'' అని అచ్చెన్న పేర్కొన్నారు. 

''దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి.  ఇది వాస్తవం కాదా? ఈ విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు సైతం చెబుతున్నారు. మీ తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?'' అని నిలదీసారు.

read more  టీడీపీ ఆఫీస్‌పై దాడిపై డీజీపీ పర్యవేక్షణ: సీబీఐ విచారణకు పయ్యావుల డిమాండ్

''వైసీపీ అరాచకాలను దేశానికి తెలిజేయాలని ఈ 36 గంటల దీక్ష చేస్తున్నాం. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా విది నిర్వహణలో అమరులైన పోలీసులకు టీడీపీ నివాళి అర్పిస్తోంది. అయితే రాష్ట్ర డీజీపీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో అమరులైన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంది'' అన్నారు. 

''ఏపీ మాదిరి పోలీసు వ్యవస్ధను దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. గూండాలు, రౌడీలను కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారు. డీజీపీ ఆపీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే కనీసం డీజీపీ స్పందించలేదు. ఇలాంటి పోలీసుల పనితీరుపై ప్రజలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''వైసీపీ నేతలు బూతులు మాట్లాడలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు వైసీపీ మంత్రులు, నేతలు ఏం మాట్లాడుతున్నారో చర్చకు సిద్దమా? ప్రతిపక్షంలో వుండగా ఆనాటి ముఖ్యమంత్రి chandrababu naidu ను నడిరోడ్డుపై కాల్చాలి, చీపుర్లతో కొట్టాలని జగన్ అనలేదా? వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి కేసును చంద్రబాబు, లోకేశ్, టీడీపీకి ఆపాదించి లబ్ది పొందిన పార్టీ వైసీపీ'' అని మండిపడ్డారు. 

''వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా టీడీపీ కార్యకర్తలు  ధైర్యంగా రక్షణ కవచంలా పార్టీని కాపాడుతున్నారు. మేం అధికారంలో ఉన్నపుడు వైసీపీ చేసే అరాచకాల్లో కేవలం ఒక్క శాతం చేసినా మీ పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నించారు. 

''kommareddy pattabhi ఇంటిపై దాడి చేసి 48 గంటలు గడిచినా ఇంతవరకు ఒక్కరిని అరెస్టు చేయని పోలీసులు పట్టాభినే అరెస్టు చేశారంటే ఈ DGP, AP  Police ఎంత దిగజారారో అర్దమౌతోంది. టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన రౌడీ మూకల్ని పోలీసులే సాదరంగా సాగనంపారు. టీడీపీ కార్యాయలంలో పట్టుబడ్డ పోలీసును కాపాడినందుకు తిరిగి టీడీపీ నేతలపైనే హత్యయత్నం కేసులు పెట్టారు'' అని తెలిపారు.

PHOTOS  ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు... పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నీచర్ మధ్యే చంద్రబాబు దీక్ష (ఫోటోలు)

''రాష్ట్ర డీజీపీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఖబడ్డార్... మీ చిట్టాలన్ని రాస్తున్నాం... రిటైర్ అవుతాం లేదా వేరే చోటికి వెళ్లి పోవచ్చనుకుంటున్నారేమో. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడున్నా వదలం'' అని హెచ్చరించారు. 

''మెగుడిని కొట్టి మెగసాలకు ఎక్కినట్టుంది వైసీపీ వైఖరి. మేం బంద్ కి పిలుపునిస్తే వాళ్లు నిరసనలకు పిలుపునిచ్చారు. మేం దీక్ష చేస్తుంటే పోటీగా వైసీపీ వాళ్లు ప్రజాగ్రహ దీక్ష చేస్తున్నారు. దేశంలో అత్యదిక ప్రజాగ్రహం ఉన్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలలో జగన్ , వైసీపీ ఎమ్మెల్యేలు మెదటి స్దానంలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. కానీ విషయం అందరికీ తెలియదు... దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్నట్టుంది'' అని అచ్చెన్న ఎద్దేవా చేసారు. 

''ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం టీడీపీదే. ప్రతి గ్రామంలోని టిడిపి కార్యకర్తలకు చెబుతున్నా... మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలు, పోలీసులు, అధికారుల చిట్టా రాసి పెట్టండి. మనం అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం'' అని అచ్చెన్న సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios